శ్రీదేవికి వచ్చిన మరణం మరెవరికీ రావొద్దు: కె. రాఘవేంద్రరావు

దివంగత నటి శ్రీదేవి గురించి తన అనుబంధాన్ని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు పంచుకున్నారు. ఆమె మరణంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన చివరి చిత్రం 'మామ్' ఆడియో వేడుకలో శ్రీదేవి మళ్ళీ కలిసి సినిమా చేద్దామని కోరినట్లు వివరించారు. కానీ ఆ కోరిక తీరకముందే ఆమె దుబాయ్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించడం తనను తీవ్రంగా బాధించిందని రాఘవేంద్రరావు తెలిపారు. 'అంతటి గొప్ప నటి, అతిలోక సుందరి అలా వెళ్లిపోకూడదు. ఆమెలాంటి చావు మరెవరికీ రావొద్దు' అని ఆయన కంటతడి పెట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్