లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ

లోక్ సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నియామకం అయ్యారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. విపక్ష పార్టీల కూటమి ఫ్లోర్ లీడర్ సమావేశంలో అందరూ రాహుల్ గాంధీ పేరును ఎంపిక చేసినట్లుగా వేణుగోపాల్ వెల్లడించారు. లోక్ సభలో విపక్ష నేతగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పేరును తాము ఖరారు చేసినట్లుగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ ప్రోటెమ్ స్పీకర్ భర్తృహరి మెహతాబ్‌కు లేఖ రాశారు.

సంబంధిత పోస్ట్