కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 256కు చేరుకుంది. మరో 220 మంది గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చూరాల్మలలో కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాలను పర్యటించారు. రాహుల్ తో పాటు ప్రియాంకగాంధీ కూడా పాల్గొన్నారు. అక్కడ అధికారులను కలిసి భద్రతకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.