దేశవ్యాప్తంగా జరుగుతున్న రైలు ప్రమాదాలపై తాజాగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. కవచ్ ఏర్పాటుకు సర్కార్ ఎంతో కృషి చేస్తోందని పేర్కొన్నారు. గురువారం లోక్సభ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. వందే భారత్లో స్లీపర్ రైళ్లను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. తొలి రైలు ట్రయల్లో ఉందన్నారు. వందే భారత్, అమృత్ భారత్, వందే మెట్రో, వందే స్లీపర్లు రాబోయే రోజుల్లో మెరుగైన సేవలను అందించనున్నాయని తెలిపారు.