దేశవ్యాప్తంగా వర్ష బీభత్సం: 1,528 మంది మృతి

జూన్ నుండి సెప్టెంబర్ వరకు సంభవించిన తీవ్ర వాతావరణ సంఘటనల కారణంగా భారతదేశవ్యాప్తంగా 1,528 మంది మరణించారు. మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రలు అత్యంత దెబ్బతిన్న రాష్ట్రాలుగా నిలిచాయి. వరదలు, భారీ వర్షాల వల్ల 935 మంది, పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలకు 570 మంది, ప్రతికూల వాతావరణం వల్ల మరో 22 మంది మరణించారు. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 290 మంది, ఉత్తరప్రదేశ్‌లో 201 మంది, హిమాచల్ ప్రదేశ్‌లో 141 మంది, జమ్మూ కాశ్మీర్‌లో 139 మంది, జార్ఖండ్‌లో 129 మంది మరణించారు. ఈ వివరాలను భారత వాతావరణ శాఖ (IMD) మంగళవారం వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్