హిమాచల్​లో వర్ష బీభత్సం.. 170 మంది మృతి!

హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. గురువారం నాటికి మొత్తం 301 రహదారులు బ్లాక్ చేశారు. 436 విద్యుత్ పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులకు గురయ్యాయి. 254 నీటి సరఫరా పథకాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జూన్​ 20న మొదలైన వర్షాల కారణంగా మొత్తం 170 మంది మరణించారు. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, క్లౌడ్ బస్టర్, విద్యుదాఘాతం వంటి ఘటనల కారణంగా 94 మంది మరణించారు. రోడ్డు ప్రమాదాల్లో 76 మంది మృతి చెందారు.

సంబంధిత పోస్ట్