TG: రాబోయే రెండు గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. శనివారం నిర్మల్, వనపర్తి, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, కొత్తగూడెం, ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మంచిర్యాల, మల్కాజిగిరి, సిద్దిపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.