వాతావరణంలో మార్పుల కారణంగా తెలంగాణలో వర్షాలు మళ్లీ మందగించాయి. ఇటీవల ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసినప్పటికీ మిగతా ప్రాంతాల్లో ఆశించినంతగా వానలు పడలేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబ్నగర్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో సా.4 గంటల లోపు వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.