గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. అయితే ఈ ఘటనానంతరం ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ డీజీపీకి లేఖలు రాశారు. తనను చంపుతానంటూ వస్తున్న బెదిరింపు కాల్స్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.