రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్తో బరిలోకి దిగింది. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చారు. మ్యాట్ హెన్రీ బౌలింగ్ ప్రారంభించగా, వైభవ్కు ఆరంభంలోనే లైఫ్ లభించింది. అతడు ఇచ్చిన క్యాచ్ను కార్తిక్ శర్మ వదిలేయడంతో బంతి బౌండరీకి వెళ్లింది. తర్వాతి బంతిని వైభవ్ సిక్స్గా మలిచాడు. ప్రస్తుతం జైస్వాల్ (7), వైభవ్ (11) పరుగులతో ఉన్నారు. తొలి ఓవర్ ముగిసేసరికి స్కోర్ 18/0గా ఉంది.