సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేసిన 'కూలీ' ఆగస్టు 14న విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు 'జైలర్ 2' షూట్లో పాల్గొంటున్నారు. తాజా సమాచారం ప్రకారం, బ్లాక్ బస్టర్ హిట్ సినిమా 'మహారాజా' ఫేమ్ నిథిలన్ స్వామినాధన్ కథకూ రజినీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కనుంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.