కొన్నేళ్లుగా వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన శైలిని మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. 'నేను మారాను' అని ప్రకటించిన ఆయన, ఇప్పుడు బాలీవుడ్లో 'పోలీస్ స్టేషన్ మే భూత్' అనే కొత్త హారర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో మనోజ్ బాజ్పాయ్, జెనీలియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గత దశాబ్ద కాలంగా ప్రేక్షకులను నిరాశపరుస్తున్న వర్మ నుంచి వస్తున్న ఈ కొత్త ప్రయత్నంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.