అధికారిక లాంఛనాలతో రేపు రామోజీరావు అంత్యక్రియలు

అధికారిక లాంఛనాలతో రేపు రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆయన మృతి పట్ల ఏపీ ప్రభుత్వం రెండు రోజుల సంతాప దినాలు ప్రకటించింది. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రామోజీ మృతికి నివాళిగా ఏపీలో రెండు రోజుల (ఆది, సోమవారాలు) పాటు సంతాప దినాలు ప్రకటించారు. రేపు చిత్ర పరిశ్రమ బంద్‌కు చలనచిత్ర నిర్మాతల మండలి పిలుపునిచ్చింది.

సంబంధిత పోస్ట్