స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ-బీఆర్ఎస్ పొత్తు!

రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో స్థానిక సంస్థల రెండవ దశ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటున్నాయని అధికార పార్టీ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆమనగల్లు మండలం మంగళపల్లి, కడ్తాల్, శెట్టిపల్లి గ్రామాల్లో ఎస్టీ, ఎస్సీ జనరల్ రిజర్వ్డ్ స్థానాల్లో రెండు పార్టీలు ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టాయి. బీజేపీ అభ్యర్థులు బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు తెలపడంతో నియోజకవర్గ బీజేపీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ పొత్తులు చర్చనీయాంశమయ్యాయి.

సంబంధిత పోస్ట్