చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య బుధవారం కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి అక్నాపూర్, అత్తాపూర్ గ్రామాల్లో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులు ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని, నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.