రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మాల్ వద్ద మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. నాగార్జునసాగర్ రహదారిపై బస్సు కారును ఢీకొట్టడంతో హైదరాబాద్కు చెందిన సాయితేజ, పవన్, రాఘవేంద్ర మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. విహారయాత్రకు వెళ్లిన ఏడుగురు స్నేహితులు తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.