కూకట్ పల్లి తమ రియల్ ఎస్టేట్ సంస్థలో ల్యాండ్ కొనుగోలు చేసిన వారికి, ఇన్వెస్ట్మెంట్లకు భారీ వడ్డీతో అంటూ ఆశచూపిన సంస్థ యజమాని కె. సురేష్ కొన్ని వందల మంది నుండి 5లక్షల రూపాయలు వసూలు చేశారు. 18 నెలలుగా వడ్డీ చెల్లించి, కొద్ది రోజులుగా యాజమాన్యం మొఖం చాటేసినారు. శుక్రవారం ప్రశ్నించేందుకు వెళ్లిన బాధితులు కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో మోసపోయినట్లు గ్రహించి కె పి హెచ్ బి పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేశారు.