అడ్వకేట్ మొయిజుద్దీన్ను కారుతో ఢీకొట్టి హత్య చేసిన కేసులో నిందితుడు ఆలం ఖాన్, అతని కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. హత్యకు రూ.25 లక్షలు సుపారీ ఇచ్చినట్లు తేలింది. గత రెండేళ్లుగా అడ్వకేట్ను చంపేందుకు పదిసార్లు ప్రయత్నించినట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.