ఎల్బీనగర్: విద్యుత్ మరమ్మత్తులు చేస్తుండగా ప్రమాదం

ఎల్బీనగర్ లో విద్యుత్ మరమ్మత్తులు చేస్తుండగా శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. 11 కేవీ విద్యుత్ వైర్లు మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా కరెంట్ పోల్ కింది భాగంలో విరిగి కింద పడటంతో కరెంటు పోల్ పై విద్యుత్ మరమ్మతులు చేస్తున్న నాగార్జున అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడిన వ్యక్తిని హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదంలో మూడు బైకులు, ఒక ఆటో ధ్వంసం అయ్యాయి.

సంబంధిత పోస్ట్