చైతన్య పురి పోలీసు స్టేషన్ పరిధిలో పాత కక్షల నేపథ్యంలో శుక్రవారం కొత్తపేట-నాగోల్ ప్రధాన రహదారి మోహన్ నగర్ లోని ఏయూ బ్యాంక్ లోకి చొరబడి ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరి క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం స్థానిక ప్రయివేట్ హాస్పిటల్ కు తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.