ఎల్.బి. నగర్లోని శ్రేష్ఠ ఆరెంజ్ హాస్పిటల్లో శనివారం అర్ధరాత్రి ఓ మహిళ వైద్య సిబ్బందిపై దాడి చేసింది. కడుపునొప్పి అంటూ వచ్చిన లలిత కరీర అనే మహిళకు ఎలాంటి అనారోగ్య సమస్య లేదని వైద్యులు నిర్ధారించారు. అనంతరం, ఆమె ఆగ్రహానికి లోనై వైద్యులు, నర్సులు, సిబ్బందిని దూషిస్తూ, విధులకు ఆటంకం కలిగించి, భౌతిక దాడికి పాల్పడినట్లు ఆసుపత్రి యాజమాన్యం ఫిర్యాదు చేసింది. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.