రంగారెడ్డి: భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్ నంది ముసలైగూడలో భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం కావడంతో రాకపోతులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది అని స్థానికులు రాజేంద్రనగర్ మున్సిపల్ కార్పొరేషన్ వారికి సమాచారం అందజేశారు.
దాదాపు గంట పాటు భారీ వర్షం పడడంతో ఎక్కడికక్కడ రోడ్లు జలమయమయ్యాయి. వెంటనే సంబంధిత అధికారులు చొరవ తీసుకొని తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్