రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలో ఆదివారం చిరుతపులి కలకలం రేపిన సంఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చిరుతను చూసిన మార్నింగ్ వాకర్స్ ఒక్కసారిగా భయబ్రాంతులకు గురైనట్లు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకు వచ్చిన చిరుత అక్కడి నుండి చెట్లలోకి వెళ్లినట్లు పేర్కొన్నారు. చిరుత పాదాలను గుర్తించిన విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నట్లు తెలిపారు.