క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్న ఓ యువకుడు మనస్తాపంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సికింద్రాబాద్ సనత్నగర్ సమీపంలో శనివారం జరిగింది. సికింద్రాబాద్ సుచిత్ర ప్రాంతానికి చెందిన రాజ్వీర్ సింగ్ ఠాకూర్ ప్రైవేట్ ఉద్యోగి. తల్లిదండ్రులు చనిపోవడంతో సుచిత్ర బాబాయి ఇంట్లో ఉంటున్నాడు. కొంత కాలంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ డబ్బు మొత్తం పోగొట్టుకొని తాగుడికి బానిసయ్యాడు.