రైలు పట్టాలపై నుంచి దాటుతూ రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి చెందిన ఘటన బొల్లారం యార్డు స్టేషన్లో మంగళవారం చోటుచేసుకుంది. మహిళ సుమారు (45)కడుపు పైన పుట్టుమచ్చ, పసుపు, ఎరుపు రంగు చీర ధరించి ఉన్నదని ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్ రైల్వే పోలీసులను సంప్రదించాలని ఎస్సై మజీద్ తెలిపారు. మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించి భద్రపరిచారు.