కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడాలని కార్మిక సంఘాల నాయకులు విమర్శించారు. చందానగర్ మున్సిపల్ కార్యాలయం నుంచి లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా కార్మికులను నష్టపరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ, ఎఐటీయూసీ, సీఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.