ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా ఫరూఖ్ నగర్ మండలంలోని వెల్ జర్ల గ్రామంలో మహిళలు, బాలల భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. లింగ సమానత్వం, మహిళల భద్రత, వేధింపుల నివారణ, పిల్లల పెంపకం, సోషల్ మీడియా, సైబర్ నేరాలపై ప్రజలకు వివరించారు. మహిళలు, బాలికలు ఎదుర్కొనే సమస్యలు, నివారణ చర్యలు, ప్రభుత్వ సేవలు గురించి తెలియజేశారు.