ఏరువాక పున్నమి సందర్భంగా షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి కర్ణాటకలోని గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రార్థించారు.