షాద్నగర్ పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు వివో హాస్పిటల్ ప్రతిరోజూ పార్కుల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది. బుధవారం విజయనగర్ కాలనీ పార్క్లో నిర్వహించిన శిబిరంలో బీపీ, షుగర్ వంటి పరీక్షలు చేసి, వైద్యులు సలహాలు అందించారు. జీవనశైలి వ్యాధులను ముందుగా గుర్తించి, నియంత్రించడానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయని వైద్యులు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.