ఫరూఖ్ నగర్ మండలంలోని వెల్ జర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆర్. బాబు నాయక్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని నిరుపేదలందరికీ సొంత ఇంటి కలను నెరవేర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే విర్లపల్లి శంకర్ సహకారంతో అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.