రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్, యువత క్రీడల వైపు ఆసక్తిగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. చెస్ మాస్టర్ వానరాసి జగన్ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన నిర్వహించబడనున్న సోనియా గాంధీ మెమోరియల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ బ్రోచర్ను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ టోర్నమెంట్లు యువ ప్రతిభను వెలుగులోకి తీసుకువస్తాయని ఎమ్మెల్యే అన్నారు.