రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ పరిధిలోని ఎంపీ శేషయ్య నగర్ కమ్యూనిటీ హాల్లో 103వ జయంతి వేడుకలను షాద్నగర్ కమ్మ సేవా సమితి అధ్యక్షులు పాతూరి వెంకటరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం షాద్నగర్ బస్టాండ్ ఆవరణలో ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు.