ప్రైవేట్ అంబులెన్స్ ఢీకొని వ్యక్తి మృతి

మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి బి. యన్. రెడ్డి కాలనీ వద్ద బుధవారం ద్విచక్ర వాహనాన్నీ ప్రైవేట్ అంబులెన్స్ ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై ఉన్న దంపతులలో భర్త తీవ్రగాయాలతో మృతి చెందాడు. భార్యని ఈసీఐఎల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఇంకా ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్