రంజీ ట్రోఫీ గ్రూప్–డి మ్యాచ్లో హైదరాబాద్ జట్టు చత్తీస్గఢ్పై విజయం దిశగా దూసుకుపోతోంది. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 415/4 స్కోరు చేసింది. కె. హిమతేజ (125 నాటౌట్), అభిరథ్ రెడ్డి (121) సెంచరీలతో రాణించారు. తొలి ఇన్నింగ్స్లో చత్తీస్గఢ్ 283 రన్స్కు ఆలౌటైంది. దీంతో హైదరాబాద్ 132 రన్స్ ఆధిక్యం సాధించింది. అమన్ రావు (52), ప్రజ్ఞయ్ రెడ్డి (52 నాటౌట్) కూడా రాణించారు.