గడిచిన పదేళ్లలో పేదలకు రేషన్ కార్డులు, సన్నబియ్యం ఇవ్వాలని ఆలోచన చేయలేదని సీఎం రేవంత్ విమర్శించారు. 'మంత్రి ఉత్తమ్ కోరినట్టుగా, తుంగతుర్తి నియోజకవర్గానికి దేవాదుల ప్యాకేజీ 6 నుంచి గోదావరి జలాలను తరలించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే వరకు ప్రభుత్వం విశ్రమించదని మాట ఇస్తున్నా. హుజూర్నగర్ నియోజకవర్గంలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించి, ఇప్పుడు తుంగతుర్తిలో రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టాం' అని అన్నారు.