ఏటీఎంలలో నగదు డ్రా చేసే వారికి ఆర్బీఐ షాక్ ఇచ్చింది. మే 1 నుంచి ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఒక నెలలో ఐదు సార్లు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఏటీఎంల నుంచి నగదు తీసుకోవచ్చు. అయితే ఆ పరిమితి దాటిన తర్వాత ఇకపై ఒక్కో లావాదేవీపై రూ.23 చొప్పున ఛార్జీ వసూలు చేసుకునేందుకు బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో అందరూ ఆన్లైన్ లావాదేవీలకే మొగ్గు చూపే అవకాశం ఉంది.