AP: కృష్ణా జిల్లాలోని పామర్రు-గుడివాడ రహదారిపై నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బి.జగదీశ్ (14) అనే బాలుడు మృతి చెందాడు. లారీ వస్తుండగా బైక్పై అడ్డుగా వెళ్లారు. లారీ కింద పడటంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతుడు పామర్రు హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. బైక్ నడిపిన వెంకటేశ్వరరావు కూడా మైనరే అని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.