ఇరాన్ ఉద్రిక్తతల మధ్య గ్లోబల్ షిప్పింగ్ మార్గాల్లో అంతరాయాలు ఏర్పడుతున్న వేళ, భారత్కు ఇంధన సరఫరాలో ఊరట లభించింది. ‘జగ్ వసంత్’ అనే భారీ నౌక 47 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో గుజరాత్లోని వాడినార్ పోర్టుకు చేరుకుంది. సముద్రంలోనే ‘షిప్ టు షిప్’ విధానంలో ‘రోజ్ గ్యాస్’ నౌకకు ఎల్పీజీ బదిలీ విజయవంతంగా జరుగుతోంది. ఇదే సమయంలో ‘పైన్ గ్యాస్’, ‘పిక్సిస్ పయనీర్’ వంటి నౌకలు కూడా ఇంధనం తీసుకువస్తున్నాయి. గ్యాస్ సరఫరాలో ఆటంకాలు లేకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.