సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే కేటీఆర్.. ఓ వైరల్ వీడియోపై సరదాగా స్పందించారు. బీజేపీ పాలిత హర్యానాలోని గురుగ్రామ్లో ఓ జర్నలిస్టు ఈత కొడుతూ రిపోర్టింగ్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిని చూసిన కేటీఆర్, “మోదీ జీ!.. ఈ రిపోర్టర్ను వెంటనే ఒలింపిక్స్కి పంపించండి. ఈత కొడుతూ రిపోర్టింగ్ చేయడాన్ని నేను ఎప్పుడూ చూడలేదు” అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు.