TG: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని.. కానీ హామీలను అమలుచేయకుండా రేవంత్ రెడ్డి విస్మరిస్తున్నాడని BRS నేత మహమూద్ అలీ మండిపడ్డారు. 'నాడు మైనార్టీలకు కేసీఆర్ డిప్యూటీ సీఎం పదవి ఇస్తే.. నేడు రేవంత్ మైనారిటీలకు ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదు. మైనారిటీలకు బడ్జెట్లో కేటాయిస్తామన్న నిధులు కేటాయించలేదు. మైనారిటీ సబ్ ప్లాన్ తెస్తామని డిక్లరేషన్లో చెప్పి చేయలేదు' అని విమర్శించారు.