తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఆరోపించారు. ఫోన్ టాపింగ్ కేసును లొట్టపీసు కేసుగా అభివర్ణించిన ఆయన.. ఈ కేసులో మాజీ సీఎం, ఆయన కుటుంబ సభ్యులను విచారించడం సరికాదని అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ను పక్కనపెట్టి, ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లా అండ్ ఆర్డర్పై దృష్టి పెట్టాలని సూచించారు.