TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి రైతుల గురించి మాటలు, స్పీచ్లకే పరిమితమవుతున్నారని ఆరోపించారు. రైతులపై నిజంగా ప్రేమ ఉంటే ‘రైతు భరోసా’ను వాయిదాలుగా ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన మండిపడ్డారు.