సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పేరు జపించడమే తప్ప, రాష్ట్రాన్ని పాలించాలనే తెలివి రేవంత్కు లేదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీలలో కాంగ్రెస్ కార్యకర్తలే ఎక్కువగా ఉన్నారని ఆమె ఆరోపించారు. చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్న హామీ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ఇప్పటికే రేవంత్ ప్రభుత్వం రూ.2 లక్షల కోట్ల అప్పు చేసిందని కవిత ఆరోపించారు.