వాషింగ్టన్లో జరిగిన అమెరికా-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో కాలిఫోర్నియాకు చెందిన డెమొక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ట్రంప్ విధ్వంసకర విధానాల వల్ల అమెరికా-భారత్ సంబంధాలు అత్యంత అధమస్థాయికి పడిపోయాయని అన్నారు. ఇరాన్ పట్ల ఆయన వైఖరి, విదేశాంగ విధాన నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా, భారత్తో సంబంధాలను ప్రభావితం చేశాయని ఖన్నా ఆరోపించారు.