AP: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలంలో విశాఖ ఎక్స్ప్రెస్లో దుండగులు చోరీకి యత్నించారు. తుమ్మల చెరువు వద్ద రైలు నడుస్తుండగా వారు కోచ్లలోకి చొరబడి ప్రయాణికుల వద్ద డబ్బు, నగలు దొంగిలించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు తక్షణమే స్పందించి గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపి దుండగులను కట్టడిలోకి తీసుకున్నారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. పోలీసులు కేసు నమోదు చేశారు.