టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచారు. రంజీ ట్రోఫీలో భాగంగా జమ్మూకశ్మీర్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై తరపున ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ బరిలోకి దిగారు. 19 బంతులు ఎదుర్కొన్న రోహిత్ (3) ఓ చెత్త షాట్ ఆడి పెవిలియన్కు చేరారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రోహిత్ను ట్రోల్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.