కేరళ ప్రభుత్వ థియేటర్లలోని సీసీటీవీ ఫుటేజీలు హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జంటలు సన్నిహితంగా ఉన్న వీడియోలు టెలిగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్)లలో దర్శనమివ్వడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. సరైన భద్రతా వ్యవస్థ లేకపోవడమే దీనికి కారణమని నిపుణులు తెలిపారు. థియేటర్లలో బలమైన పాస్వర్డ్లు, నెట్వర్క్, సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే యువత థియేటర్లలో సన్నిహితంగా ఉండొద్దని సూచిస్తున్నారు.