రూ.10 లక్షల లోన్.. అర్హతలివే

మహిళలు, SC, ST యువతను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు 'స్టాండ్‌అప్ ఇండియా' పథకాన్ని 2016 ఏప్రిల్ 5న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీని ద్వారా రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు లోన్ తీసుకోవచ్చు. ప్రతి బ్యాంకు బ్రాంచీలోనూ ఒక్కరికైనా ఈ లోన్ ఇవ్వాలని కేంద్రం సూచించింది. 18 ఏళ్లు దాటిన వారు ఈ లోన్‌ కోసం బ్యాంకులను సంప్రదించవచ్చు. పూర్తి వివరాలకు https://www.standupmitra.in/ సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్