సెమీకండక్టర్ మిషన్ 2.O కోసం రూ. 40 వేల కోట్లు

దేశ పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ రంగ విస్తరణకు మరిన్ని నిధులు కేటాయించింది. సెమీ కండక్టర్‌ 2.0 విధానాన్ని ప్రవేశపెట్టింది. కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో కీలక ఖనిజాల వెలికితీత పథకాన్ని ప్రారంభించింది. మూడు కొత్త రసాయన పార్కుల స్థాపన, భవన నిర్మాణ రంగంలో పరికరాల అభివృద్ధి, కంటైనర్ తయారీ పరిశ్రమ ప్రోత్సాహం, జాతీయ ఫైబర్ విధానం, జౌళి రంగ విస్తరణ, ఆధునీకరణ, ఉపాధి కల్పన వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ చర్యలు దేశ పారిశ్రామికాభివృద్ధికి దోహదపడతాయని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్