TG: సికింద్రాబాద్లోని జలమండలి కార్యాలయం వద్ద గురునానక్ కళాశాలలో బీటెక్ చదువుతున్న విశాల్ అనే విద్యార్థి ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందాడు. విశాల్ ద్విచక్ర వాహనంపై జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఉప్పల్కు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
CREDITS: BIG TV